Tuesday, March 10, 2020

యెస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త : మారటోరియంను ఎత్తివేత

యెస్ బ్యాంక్ పై ఆర్ బీ ఐ విధించిన మారటోరియంను శనివారం నాటికి ఎత్తివేయనున్నట్లు కొత్తగా వచ్చిన బ్యాంక్ పరిపాలకుడు ప్రశాంత్ కుమార్ వెల్లడించిన నేపథ్యంలో..ప్రకటించిన మర్నాటికే బ్యాంక్ ఈ ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవలను పునరుద్ధరించడం గమనార్హం. వీలైనంత త్వరగా ఖాతాదారులకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రశాంత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎస్ బ్యాంక్ ఖాతాదారుల నగదు ఉపసంహరణ పై ఆర్ బీఐ రూ.50 వేల పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. యెస్ బ్యాంక్ పై ఆర్బీఐ మారటోరియంను విధించిందని తెలియగానే ఖాతాదారులు యెస్ బ్యాంక్ బ్రాంచ్ ల ఎదుట క్యూ కట్టారు. బ్యాంక్ లో ఉన్న తమ డిపాజిట్లను విత్ డ్రాలు చేసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే..ఎక్కువ వడ్డీకి ఆశపడి..అడిగిన వారందరికీ పెద్ద ఎత్తున రుణాలిచ్చేసి..తిరిగి వాటిని రాబట్టలేని కారణంగానే ఆర్ బీఐ యెస్ బ్యాంక్ లావాదేవీలపై షరతులు విధించింది.

SHARE THIS

Author:

0 comments: