అమెరికా సంయుక్త రాష్ట్రాలు , భారతదేశాలు మంచి సంభందాలు కలిగుండటం ప్రపంచానికే మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్అన్నారు . ఇందు కోసం మన ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నూతనంగా నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రారంభ సన్నాహక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యాలయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అమెరికా రాయబారి కేన్నత్ జస్టర్ తదితరులు పాల్గొన్నారు.
0 comments: