Tuesday, March 10, 2020

వైకాపా ధోరణిని ను తప్పుబడుతూ తీర్పు ఇచ్చిన కోర్టు : చర్యలపై

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తేరుకోలేని షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, ఈ కేసులో తుది తీర్పును మంగళవారం వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులకు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేసిన రాజకీయ రంగులను తొలగించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది.  తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్టు పూర్తి ఆధారాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది.

SHARE THIS

Author:

0 comments: